Thursday, April 25, 2024

గుజ‌రాత్ బోణి – ఆర్సీబికి హ్యాట్రిక్ ఓట‌మి..

ముంబయి: మహిళల ప్రీమియర్ లీగ్‌20 లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ముచ్చటగా మూడో ఓటమి పొందింది. నేడు జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీపై గుజరాత్‌ జెయింట్స్‌ 11 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆర్సీబీ కెప్టెన్‌ స్మృతి మంధాన (18) పరుగులకు ఔట్ కాగా, సోఫీ డివైన్‌ (66; 45 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకంతో రాణించింది. ఎల్లీస్‌ పెర్రీ (32; 25 బంతుల్లో 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. చివర్లో హీథర్‌ నైట్‌ (30; 11 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడినా జట్టును విజయాలతీరాలకు చేర్చలేకపోయింది. గుజరాత్ బౌలర్లలో ఆష్లీన్‌ గార్డ్‌నర్‌ మూడు, అన్నాబెల్ రెండు, మాన్సీ జోషి ఒక వికెట్ పడగొట్టారు.


టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్ ఓపెనర్‌ సోఫియా డంక్లీ (65; 28 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు), హర్లీన్‌ డియోల్‌ (67; 45 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకాలతో విరుచుకుపడటంతో భారీ స్కోరు సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్, హీథర్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. మేఘన్‌ స్కట్, రేణుకా తలో వికెట్ తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement