Friday, April 19, 2024

Big Breaking | ఫైనల్స్​లోకి గుజరాత్​.. చెన్నైతో ఎల్లుండి పోరు!

క్వాలిఫయర్​ సెకండ్​ మ్యాచ్​లో భాగంగా ఇవ్వాల (శుక్రవారం) జరిగిన కీలక మ్యాచ్​లో ముంబయి దారుణంగా ఓడిపోయింది. టాస్​ గెలిచిన ముంబయి జట్టు తొలుత బౌలింగ్​ తీసుకుంది. బ్యాటింగ్​కు దిగిన గుజరాత్​ నిర్ణీత ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి రికార్డు స్థాయిలో స్కోరు చేయగలిగింది. ఇందులో మాస్టర్​ బ్యాటర్​ శుభ్​మన్​ గిల్​ 60 బంతుల్లో 129 పరుగులు చేశాడు. ఇక మొత్తం 233 పరుగులతో గుజరాత్​ అద్భుతంగా రాణించి.. ముంబయి ముందు 234 పరుగుల అతిపెద్ద టార్గెట్​ని పెట్టగలిగింది.

కాగా, చేజింగ్​కు దిగిన ముంబయి జట్టు ఆదిలోని ఓపెనింగ్​ బ్యాట్స్​మన్​ ఇంజూరీ కారణంగా రిటైర్డ్​ హర్ట్​గా పెవిలియన్​ చేరాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే.. కెప్టెన్​ రోహిత్​ శర్మ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. అయితే.. ఆ తర్వాత కామెరాన్​ గ్రీన్​ (30), సూర్యకుమార్​ (61) కలిసి స్కోరు బోర్డుని పరుగులు పెట్టించే పనిలో పడ్డారు. ఇక.. వీరి సక్సెస్​ఫుల్​ జంటను బి. లిటిల్​ విడగొట్టి స్కోరు బోర్డుకు బ్రేకులు వేశాడు. ఆ తర్వాత వచ్చిన తిలక్​వర్మ (43) కూడా కాస్త పోరాటం చేసినప్పటికీ.. వీరి తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవరూ పరుగులు రాబట్టలేకపోయారు. దీంతో గుజరాత్​ బౌలర్లు రెచ్చిపోయి ఆడడంతో ఇంకా 2 ఓవర్లు మిగిలి ఉండగానే ముంబయి ఆల్​ అవుట్​ అయ్యింది. దీంతో గుజరాత్​ 62 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్స్​లోకి ఎంటరయ్యింది. ఎల్లుండి జరిగే మ్యాచ్​లో చెన్నై, గుజరాత్​ పోటీ పడనున్నాయి.

ఈ మ్యాచ్​లో గుజరాత్​ బౌలర్లలో మోహిత్​ శర్మ 5 వికెట్లు తీయగా.. మహ్మద్​ షమీ, రశీద్​ ఖాన్​ తలా రెండు వికెట్లు పడగొట్టారు. జాషువా లిటిల్​ ఒక వికెట్​ తీశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement