Thursday, April 25, 2024

Breaking: టాటా ఐపీఎల్ 2022 విజేత‌గా గుజ‌రాత్‌.. అరంగేట్రం సీజ‌న్‌లోనే రికార్డుల మోత‌!

టాటా ఐపీఎల్ 2022లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ విజ‌య‌భావుటా ఎగ‌రేసింది. సీజ‌న్‌లో ఫ‌స్ట్ టైమ్ ఎంట్రీ ఇచ్చిన గుజ‌రాత్ టీమ్ తొలిసారే క‌ప్ ఎగ‌రేసుకుపోయింది. ఇవ్వాల (ఆదివారం) న‌రేంద్ర మోదీ స్టేడియంలో జ‌రిగిన ఈ ఆఖ‌రి పోరాటంలో తొలుత బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ అనుకున్న రీతిలో ఆడ‌లేక‌పోయింది. 130 ప‌రుగుల అతి త‌క్కువ స్కోరుకే ఆల్ అవుట్ అయ్యింది. దీంతో 131 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టీమ్ 3 వికెట్లు మాత్ర‌మే పోగొట్టుకుని ఇంకా ఓవ‌ర్లు మిగిలి ఉండ‌గానే టార్గెట్‌ని ముద్దాడి క‌ప్పును సొంతం చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement