Thursday, April 25, 2024

Big Breaking | అంబరాన్నంటేలా ఐపీఎల్​ ముగింపు వేడుకలు.. సినీ ప్రముఖులతో స్పెషల్​ ప్రోగ్రామ్స్​!

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (IPL 2023) ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరగుతున్నాయి. ఎల్లుండి (ఆదివారం) ఫైనల్​ మ్యాచ్​ జరగనుంది. ఈ మ్యాచ్​లో పోటీ పడేందుకు ఇప్పటికే చెన్నై సూపర్​ కింగ్స్​ అర్హత సాధించగా.. ఇవ్వాల జరిగే మ్యాచ్​లో గెలిచిన జట్టు చెన్నైతో ఢీ కొట్టనుంది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఫైనల్స్​ని కన్నులపండువగా నిర్వహించేందుకు మ్యూజిక్​ మాస్ట్రో ఏఆర్​ రెహమాన్​, బాలీవుడ్​ స్టార్​ రణవీర్​ సింగ్​ రానున్నట్టు తెలుస్తోంది. వీరితోపాటు రాపర్​ కింగ్​ డీజే న్యూక్లియా, సింగర్​ వివైన్​ జోనితా గాంధీ ప్రదర్శన కూడా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్​ ముగింపు వేడకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అహ్మదాబాద్​ వేదికగా జరిగే ఈ ఫైనల్స్​కు ముందే సెలబ్రేషన్స్​ ఉండనున్నాయి. దీని కోసం బీసీసీఐ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.

వేడుకలకు రాపర్ కింగ్, DJ న్యూక్లియా, గాయకులు డివైన్, జోనితా గాంధీ ప్రదర్శన ఇవ్వనున్నట్లు ఇవ్వాల (శుక్రవారం) ప్రకటించారు. మే 28 (ఆదివారం) అహ్మదాబాద్‌లోని స్టేడియంలో ఫైనల్ మ్యాచ్​ జరగనుంది.  ప్రసిద్ధ ఎంటర్‌టైనర్‌ల ప్రదర్శనలతో టోర్నమెంట్ ముగింపు అంగరంగ వైభంగా నిర్వహించనున్నారు. కాగా,  IPL 2023 ఈ ఏడాది మార్చి 31వ తేదీన గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్‌తో ప్రారంభమైంది.

కాగా, ప్రారంభ మ్యాచ్​లో బాలీవుడ్ తారలు రష్మిక మందన్న, తమన్నా భాటియా ప్రదర్శన ఇచ్చారు. సింగర్​ అరిజిత్ సింగ్ తన పెప్పీ పాటలతో అలరించారు. టోర్నీలో గుజరాత్ టైటాన్స్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచింది. COVID-19 కారణంగా రెండేళ్లపాటు మ్యాజ్​లు జరగలేదు. ఆ తర్వాత ఐపీఎల్​ 2023 పేరుతో ఈసారి టోర్నమెంట్ జరుగుతోంది. ఫైనల్ మ్యాచ్ ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement