Saturday, April 20, 2024

నాలుగో టెస్ట్ డ్రా – బోర్డ‌ర్ – గ‌వాస్క‌ర్ ట్రోఫిని నిల‌బెట్టుకున్న భార‌త్ …

అహ్మాదాబాద్ – ఆసీస్ తో జ‌రిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది.. ఆట చివ‌రి రోజున ఆసీస్ బ్యాటింగ్ ప్రారంభించి టీ విరామ స‌మ‌యానికి రెండు వికెట్ల న‌ష్టానికి 175 ప‌రుగులు చేసింది.. దీంతో ఆసీస్ కు 84 ప‌రుగుల ఆధీక్యం ల‌భించింది.. ఈ మ్యాచ్లో ఇరుజ‌ట్ల‌కు గెలుపు అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో కెప్టెన్ల అంగీకారంతో టీ బ్రేక్ త‌ర్వాత ఆట‌ను నిలిపివేసి డ్రా అయిన‌ట్లు ప్ర‌క‌టించారు.. 2 – 1 మ్యాచ్ ఆధీక్యంలో ఉన్న భార‌త్ బోర్డ‌ర్ – గ‌వాస్క‌ర్ ట్రోఫీని నిలుపుకుంది.. కాగా ఆసీస్ బ్యాటింగ్ లో ట్రావీస్ హెడ్ 90 ప‌రుగుల‌కు ఔట్ కాగా, స్మిత్ 10, లబుషేన్ 63ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచారు.. కాగా టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్స్ పోరుకి ఆసీస్,భార‌త్ లు అర్హ‌త సాధించాయి.. కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు, అశ్వీన్ కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement