Wednesday, March 27, 2024

ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ క్రిస్టియన్‌ అత్సు ఇకలేరు.. భూకంపం కారణంగా మరణం

తుర్కియేలో ఈ మధ్య వచ్చిన భారీ భూకంపం ఫుట్‌బాల్‌ అభిమానులను శోక సంద్రంలో ముంచెత్తింది. భూ కంపం కారణంగా 31 ఏళ్ల క్రిస్టియన్‌ అత్సు మరణించినట్లు సిరియా ప్రభుత్వం ధృవీకరించింది. సహాయక బృందాలు స్పందించి శిథిలాలను వెలికితీసి ఈ ఫుట్‌బాలర్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. గత 10 రోజులుగా చికిత్స పొందుతున్న క్రిస్టియన్‌ అత్సు శుక్రవారం అర్ధరాత్రి చనిపోయినట్లు ప్రభుత్వం పేర్కొంది.


క్రిస్టియన్‌ అంటక్యా సిటీలో ఉండేవాడు. ఫిబ్రవరి 6న తుర్కియేలో భూమి ప్రకంపనలు మొదలైనప్పటి నుంచి క్రిస్టియన్‌ జాడ దొరకలేదు. 10 రోజుల క్రితం జాడ దొరికి నప్పటికే అప్పటికే క్రిస్టియానా ప్రాణాలతో పోరాడుతున్నాడు. ప్రాణాలతో బయటపడాలని అందరూ ప్రార్థించారు. కానీ అవేవి ఫలించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement