Thursday, April 25, 2024

టెన్నిస్ ఛాంపియన్ షిప్ 2022లో డబుల్స్ ట్రోఫీ అందుకున్న ధోనీ.. వైరల్ గా ఫొటో

టెన్సిస్ ఆటగాడిగా మారిపోయాడు టీమిండియా మాజీకెప్టెన్ ధోనీ..ఆట ఏదైనా విజయం తనదే అన్నట్టు..ఫైనల్లో విజయం సాధించి, ట్రోఫీ అందుకున్నాడు. జార్ఖండ్‌ రాష్ట్ర క్రికెట్ సంఘం అధ్వర్యంలో నిర్వహించిన టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ 2022లో ధోనీ, సుమిత్‌ కుమార్ బజాజ్‌ జోడీ డబుల్స్‌ విజేతగా నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్‌ ధోనీ జోడీ, ప్రత్యర్థి జోడీ కంటే నాలుగు పాయింట్లు ఆధిక్యంలో ఉంది. అప్పటికే వెలుతురు తగ్గిపోవడంతో ఆటను నిలిపి వేసిన నిర్వాహకులు ధోనీ జోడీని విజేతగా ప్రకటించారు. ధోనీ డబుల్స్‌ ట్రోఫీ అందుకున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ‘ఎంఎస్‌డీ హాబీలు.. బైక్‌లు కలెక్ట్‌ చేయడం, ట్రోఫీలు గెలవడం’ అని ఒక యూజర్‌ స్పందించాడు. ‘ఏ ఆటలో అయినా విజేత నువ్వే’ అని మరో యూజర్‌ కామెంట్‌ పెట్టాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement