Saturday, April 20, 2024

బధిరుల ఒలింపిక్స్‌, ధనుష్‌కు మరో స్వర్ణం.. షూటింగ్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో అద్భుత ప్రదర్శన

బ్రెజిల్‌లో జరుగుతున్న 24వ బధిరుల ఒలింపిక్స్‌ (డెఫ్‌లింపిక్స్‌)లో తెలంగాణ బధిర షూటర్‌ ధనుష్‌ శ్రీకాంత్‌ జోరు కొనసాగుతోంది. అతను రెండో స్వర్ణాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే పురుషుల వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో పసిడి గెలిచిన అతను.. తాజాగా మిక్స్‌డ్‌ టీమ్‌లో ప్రియేషతో కలిసి బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ ఫైనల్లో ధనుష్‌- ప్రియేష ద్వయం 16-10 తేడాతో సెబాస్టియన్‌- సబ్రీనా (జర్మనీ)పై విజయం సాధించారు. అర్హత రౌండ్‌లో 414.0 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచిన భారత ద్వయం.. పసిడి పోరులోనూ అత్యుత్తమ ప్రదర్శన ప్రదర్శించారు. మరో భారత జోడీ శౌర్య- నటాషా.. కాంస్య పతక పోరులో 8-16తో ఒలెక్సాండర్‌- లికోవా (ఉక్రెయిన్‌) చేతిలో ఓడారు. పుట్టుకతోనే చెవులు వినపడని, మాటలు రాని 19ఏళ్ల ధనుష్‌.. #హదరాబాద్‌లోని గగన్‌ నారంగ్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న సంగతి తెలిసిందే. డెఫ్‌లింపిక్స్‌లో షూటింగ్‌లో భారత్‌కిది మూడో స్వర్ణం. ఇప్పటికే పురుషుల వ్యక్తిగత 10మీ. ఎయిర్‌ పిస్టల్‌లో అభినవ్‌ పసిడి నెగ్గాడు. షూటింగ్‌లోనే మరో రెండు కాంస్యాలు కూడా భారత్‌ ఖాతాలో చేరిన విషయం విదితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement