Thursday, April 18, 2024

అండ‌ర్-19 క్రికెట్ జ‌ట్టులో ఐదుగురు క్రికెట‌ర్ల‌కు క‌రోనా

క‌రోనా రోజురోజుకు విజృంభిస్తోంది. వారు.. వీరు అనే తేడా లేకుండా అంద‌రికీ వ్యాపిస్తోంది. ఇటీవ‌లే బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన విష‌యం విదిత‌మే. అయితే తాజాగా.. వెస్టిండీస్‌లో అండర్-19 ప్రపంచకప్ కోసం పర్యటిస్తున్న భారత జట్టులో కరోనా కలకలం రేగింది. టీమిండియా కెప్టెన్ యశ్ ధుల్‌తో పాటు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ కరోనా బారిన పడ్డారు. వీరితో క్లోజ్ కాంటాక్టులో ఉన్న బౌలర్ ఆరాధ్య యాదవ్‌తో పాటు వసు వత్స్, మానవ్ ప్రకాశ్, సిద్ధార్థ్ యాదవ్‌లకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వీరంతా వరల్డ్‌ కప్‌ నుంచి నిష్ర్కమించారు. ఐదుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో ప్రస్తుతం భారతజట్టుకు 11 మంది ఆటగాళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. కెప్టెన్, వైస్ కెప్టెన్ ఐసోలేషన్‌లోకి వెళ్లడంతో ఐర్లాండ్‌తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌కు నిశాంత్ సంధు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement