Friday, March 29, 2024

ఐపీఎల్ లోపై కరోనా పంజా..చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సిబ్బందికి కరోనా పాజిటివ్

ఐపీఎల్ టోర్నీపై కరోనా పంజా విసురుతోంది. ఇప్పటికే కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ కు చెందిన వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారినపడగా, తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనూ కొవిడ్ కలకలం రేగింది. ఆ జట్టు మొత్తానికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఆటగాళ్లెవరికీ కరోనా సోకలేదని వెల్లడైంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్, బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, బస్ క్లీనర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా, పాజిటివ్ వచ్చిన ముగ్గురికి నేడు మరోమారు పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా ఫలితాలను రెండుసార్లు నిర్ధారించుకోవాలని చెన్నై యాజమాన్యం భావిస్తోందని బీసీసీఐ వర్గాలు మీడియాకు తెలిపాయి. తదుపరి పరీక్షలు నిర్వహించేంత వరకు ఆటగాళ్లను ఐసోలేషన్ లో ఉండాలని సూచించినట్టు అధికాాారులు పేర్కొన్నారు. దీంతో ఐపీఎల్ లో కరోనా కేసుల వెలుగు చూడటంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోల్ కత్తా టీంలో కరోనా కేసులు నిర్థారణ కావడంతో ఆజట్టు ఇవాళ ఆర్సీబీతో ఆడాల్సిన మ్యాచ్ రద్దయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement