Friday, March 29, 2024

రవీంద్ర జడేజాపై బీసీసీఐ సీరియస్‌.. ఎందుకు.?

ఆల్‌ రౌండర్‌, ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ ప్లేయర్‌ రవీంద్ర జడేజాపై బీసీసీఐ అగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మోకాలిగాయానికి గురై టోర్నీ నుంచి తప్పుకున్న జడేజాకు ఇటీవల సర్జరీ కూడా జరిగింది. జడేజా కోలుకుని త్వరలో జరిగే టీ-20 ప్రపంచకప్‌కు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ భావించింది. కానీ ప్రస్తుత పరిస్థితి ప్రకారం జడేజాకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.

జడేజా మోకాలి గాయానికి స్వయం కృతాపరాధమేనని తెలుస్తోంది. జడేజా ఆటవిడుపుగా సాహస క్రీడల్లో పాల్గొని మోకాలి గాయానికి బాధ్యుడయ్యాడు. ఒక కాంట్రాక్ట్‌ ప్లేయర్‌ ఇలా మైదానం వెలుపల ఆటవిడుపు క్రీడల్లో పాల్గొనడం మొదటికే మోసమయ్యిందని క్రికెట్‌ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement