Friday, April 26, 2024

Breaking: భంగ‌ప‌డ్డ బెంగ‌ళూరు, క్వాలిఫ‌య‌ర్ 2లో ఘోర ప‌రాజ‌యం.. ఫైన‌ల్స్‌కి చేరిన రాజ‌స్థాన్‌

బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భ‌తంగా ఆడింది. అయితే ధాటిగా ఆడే ప్రయత్నంలో కెప్టెన్ సంజూ శాంసన్ (23) పెవిలియన్ చేరాడు. ఓపెనర్ జోస్ బట్లర్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో (106) ఆక‌ట్టుకున్నాడు. దాదాపు ఒంటిచేత్తే మ్యాచ్ గెలిపించాడ‌నే చెప్ప‌వ‌చ్చు. దీనికంటే ముందు జరిగిన మ్యాచ్​లో పటిదర్​ 112 పరుగులతో మ్యాచ్​ని ఒంటిచేత్తో గెలిపించిన మాదిరిగానే.. ఈ మ్యాచ్​లో బట్లర్​ వీరోచిత పోరాటం చేశాడు.. కడదాకా నిలకడగా ఆడి మ్యాచ్​ విన్నింగ్​లో తనదైన పాత్ర పోషించాడు.

https://twitter.com/IPL/status/1530240282163236864

కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన బెంగ‌ళూరు జ‌ట్టు నిర్ణీత ఓవర్లలో 157 పరుగులు మాత్రమే చేసింది. దీంతో చేజేతులా మ్యాచ్ విన్నింగ్ చాన్సెస్‌ని పొగొట్టుకుంది. బ్యాటింగ్‌, బౌలింగ్ విభాగాల్లో ఏమాత్రం మెరుగైన ఆట‌తీరు క‌న‌బ‌ర్చ‌లేదు. దీంతో త‌గిన మూల్యం చెల్లించుకుని ఇంటిముఖం ప‌ట్టింది. ఇక గుజారాత్ టైటాన్స్‌తో 29న జ‌ర‌గ‌బోయే ఫైన‌ల్ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు త‌ల‌ప‌డ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement