Wednesday, March 27, 2024

బీసీసీఐ వర్కింగ్ కమిటీ లో అజారుద్దీన్ కి చోటు..

బీసీసీఐ కొత్తగా ఏర్పాటు చేసిన వర్కింగ్ కమిటీ ప్యానెల్ లో సభ్యుడి హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్‌ నియిమించబడ్డారు. దేశవాళీ క్రికెట్ వ్యవహారాల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూపు దేశవాళీ ఆటగాళ్లకు పరిహార ప్యాకేజీతోపాటు దేశవాళీ క్రికెట్‌లోని ఇతర అంశాలపై ఈ 10 మంది సభ్యుల ప్యానెల్ పనిచేస్తుంది. గత నెల 20న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్ లో అజారుద్దీన్ తో పాటు రోహన్ జైట్లీ, అవిషేక్ దాల్మియా కూడా ఈ గ్రూపులో ఉన్నారు. ఈ ప్యానెల్‌లో ఉన్న మిగతా వారిలో యుధ్‌వీర్ సింగ్ (సెంట్రల్ జోన్), దేవజీత్ సైకియా (నార్త్‌ఈస్ట్ జోన్), సంతోష్ మేనన్ (సౌత్ జోన్) ఉన్నారు. బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్ ధుమాల్‌తో ఏర్పాటైన ఈ ప్యానెల్ గంగూలీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.

ఇది కూడా చదవండి: ఇంగ్లాండ్‌కు చుక్కెదురు..యూరో కప్ విజేత ఇటలీ..

Advertisement

తాజా వార్తలు

Advertisement