Saturday, April 6, 2024

టీమిండియా మోసం చేసి గెలిచింది: టిమ్ పైన్

గత ఏడాది ఆస్ట్రేలియాలో జరగిన బోర్డర్-గవాస్కర్ గెలవడం పై ఆసీస్ టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్ వివాదస్పద కామెంట్స్ చేశాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా తమ దృష్టిని మళ్లించి, మోసపూరితంగా గెలిచిందని అన్నాడు. తమను టీమిండియా తప్పుదోవ పట్టించిన విధానం సూపర్ గా ఉందని ఎద్దేవా చేశాడు. మూడో టెస్టు ముగిసిన తర్వాత గబ్బాకు వెళ్లబోమని టీమిండియా చెప్పిందని… దీంతో, నాలుగో టెస్టును ఎక్కడ నిర్వహించాలనే ఆలోచనలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆలోచనలో పడిందని చెప్పాడు. అయితే, ఆ తర్వాత ఏమైందో కానీ గబ్బాలో ఆడతామని ఇండియా చెప్పిందని… ఆ విధంగా ఆస్ట్రేలియా జట్టు ఏకాగ్రతను దెబ్బతీసిందని అన్నాడు.ఇండియా చేసిన పనికి తాము ఆటపై సరిగా దృష్టి పెట్టలేకపోయామని టిమ్ పైన్ చెప్పాడు. అయితే పైన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భారత అభిమానులు విరుచుకుపడుతున్నారు. సిరీస్ ముగిసిన వెంటనే ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయలేదని వారు ప్రశ్నిస్తున్నారు. మీరు చేసే మోసంతో పోలిస్తే మేమెంత? అని మండిపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement