Saturday, April 20, 2024

అంతా విరాట్ వ‌ల్లే: అనుష్క‌ శ‌ర్మ‌

ప‌ని, ఇల్లు రెండూ ఒక్క చోటే అయితే ఎలా ఉంటుంది. ఈ విష‌యం ప్ర‌స్తుతం బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ‌ను అడిగితే స‌రిగ్గా చెబుతుంది. త‌న భ‌ర్త‌, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో క‌లిసి ఇంగ్లండ్ వెళ్లిన అనుష్క‌.. శ‌నివారం త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫ‌న్నీ పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఇండియ‌న్ టీమ్ త‌న కుటుంబాల‌తో క‌లిసి ఎజియ‌స్ బౌల్ స్టేడియంలోనే క్వారంటైన్‌లో ఉంటోంది. అయితే స్టేడియంలో తాను దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఆమె రాసిన కామెంట్ అభిమానుల‌కు న‌వ్వు తెప్పిస్తోంది. ప‌నిని ఇంటికి తీసుకురావ‌ద్దు అన్న రూల్ కొన్నాళ్ల పాటు విరాట్‌కు వ‌ర్తించ‌దు అని కామెంట్ చేసిన అనుష్క‌.. క్వారంటైన్ ఎట్‌ద స్టేడియం అని ఓ హ్యాష్‌ట్యాగ్‌ను పోస్ట్ చేసింది. గత బుధ‌వారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత ఇండియ‌న్ మెన్స్‌, వుమెన్స్ టీమ్స్ ఇంగ్లండ్ ఫ్లైటెక్కిన విష‌యం తెలిసిందే. సుదీర్ఘ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా టీమిండియా వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌తోపాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement