Thursday, April 18, 2024

ఐపీఎల్‌లో అమిత్ మిశ్రా అరుదైన ఘనత

సీనియర్ బౌలర్ అమిత్ మిశ్రా ఐపీఎల్​లో అరుదైన ఘనత సాధించాడు. ఢిల్లీ జట్టు తరఫున 100 మ్యాచ్​లు ఆడిన తొలి ఆటగాడిగా నిలిచాడు. మిశ్రా తర్వాత సెహ్వాగ్ (86 మ్యాచ్​లు), శ్రేయస్ అయ్యర్(79), రిషబ్ పంత్(69), షాబాజ్ నదీమ్(69) ఉన్నారు. చెన్నైతో శనివారం జరిగిన మ్యాచ్​తో అమిత్ మిశ్రా ఈ మార్క్​ను అందుకున్నాడు.

అటు ఐపీఎల్ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన వారిలో మిశ్రా(160 వికెట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ టాప్​లో కొనసాగుతున్నాడు. అలానే ఈ టోర్నీలో అత్యధికంగా మూడు సార్లు హ్యాట్రిక్​ సాధించిన బౌలర్ కూడా మిశ్రానే కావడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement