Wednesday, April 24, 2024

296 పరుగులకు కివీస్ ఆలౌట్‌.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఇండియా..

కాన్పూర్ టెస్టులో టీమిండియా బౌలర్లు సత్తాచాటారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 296 పరుగులకే న్యూజిలాండ్ ను ఆలౌట్ చేశారు. కివీ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ (18), రాస్ టేలర్ (11), హెన్రీ నికోల్స్ (2), టామ్‌ బ్లండెల్‌ (13), రచిన్ రవీంద్ర (13), కైల్ జేమీసన్‌ (23), టిమ్ సౌథీ (5), విల్ సోమర్‌విల్లె (6), అజాజ్ పటేల్‌ (5 నాటౌట్‌) పరుగులు చేశారు. బారత బౌలర్లలో అక్షర్ పటేల్‌ ఐదు వికెట్లతో సత్తా చాటాడు.

కాగా, మూడో రోజు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన భార‌త్ 5 ఓవ‌ర్ల‌లో 14 ప‌రుగులు చేసి 1 వికెట్ కోల్పోయింది. శుభ్‌మ‌న్ గిల్ ఒక్క ప‌రుగుకే పెవిలియ‌న్ చేరాడు. మ‌యాంక్ అగ‌ర్వాల్‌, పుజారా బ్యాటింగ్ కొన‌సాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement