Wednesday, March 27, 2024

నిన్న ఇంగ్లాండ్ తో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్​ సెమీఫైనల్ మ్యాచ్​లో భారత ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియాపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కాగా నిరాశ పరిచినందుకు క్షమించండంటూ టీమిండియా క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. అటు కెప్టెన్​ రోహిత్​ శర్మ, స్టార్​ బ్యాటర్​ విరాట్​ కోహ్లీ, స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ క్రమంగా టీ20 జట్టుకు దూరమవుతారని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.ఈ నేపథ్యంలో.. ఓటమిపై క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. మేం ఆస్ట్రేలియన్ తీరాలకు వెళ్లి..ఇండియన్స్‌ కలను సాకారం చేయలేకపోయాం. ఇది నిజంగా నిరాశనే. స్టేడియంలలో మాకు మద్దతు ఇవ్వడానికి పెద్ద సంఖ్యలో హాజరైన మా అభిమానులందరికీ ధన్యవాదాలు. ఈ జెర్సీని ధరించి, మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు ఎల్లప్పుడూ గర్వంగా భావిస్తున్నాను అంటూ ట్వీట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement