Friday, April 19, 2024

Breaking: సెంచ‌రీతో దంచికొట్టిన ప‌టీద‌ర్‌.. ల‌క్నో టార్గెట్ ఎంతంటే

టాటా ఐపీఎల్ 2022లో భాగంగా ప్లే ఆఫ్స్‌లో సెకండ్ ఎలిమినేష‌న్ మ్యాచ్ ఇవ్వాల జ‌రుగుతోంది. ఈ మ్యాచ్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. కాగా, టాస్ గెలిచి ల‌క్నో బౌలింగ్ ఎంచుకుంది. ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన బెంగ‌ళూరు టీమ్ అద్భుత‌మైన ఆట‌తీరు క‌న‌బ‌రిచింది. తొలుత డుప్లెసిస్ (0) డ‌క్ అవుట్ అయినా.. ఆ త‌ర్వాత వ‌చ్చిన బ్యాట్స్‌మ‌న్ రాణించారు. కోహ్లీ 25, లాంర‌ర్ 14, మ్యాక్స్‌వెల్ 9, ప‌రుగులు చేయ‌గా.. ప‌టీద‌ర్ 112 నాటౌట్‌, దినేశ్ కార్తీక్ 37 నాటౌట్‌గా నిలిచారు. మొత్తానికి నిర్ణీత ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 2017 ప‌రుగులు చేశారు. దీంతో ల‌క్నో 208 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement