Thursday, April 25, 2024

పిచ్‌ కాదు ఆట ముఖ్యం: జోఫ్రా ఆర్చర్‌

ఇండియా-ఇంగ్లాండు మూడో టెస్ట్‌ అనంతంరం పిచ్‌ పై చెలరేగిన వివాదంపై ఫేస్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ స్పందించాడు. ఆటగాళ్లకు ఆటతోనే సంబంధమని…స్పిన్‌ పిచ్‌తో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నాడు. ఓ వైపు ఇంగ్లీష్‌ మాజీ ఆటగాళ్లు టీమిండియా తమకు అచ్చొచ్చిన స్పిన్‌ పిచ్‌లు తయారు చెయించుకుంటుందని విమర్శలు గుప్పిస్తుంటే…ఆర్చర్‌ కామెంట్స్‌ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఎలాంటి పిచ్‌ల మీద ఆడుతున్నామనే విషయం నాకు అవసరం లేదని…ఈ విషయం పై ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదన్నాడు ఆర్చర్‌. గతంలో ఇంగ్లాండులో కూడా టెస్టు మ్యాచ్‌లు రెండ్రోజుల్లో ముగిసాయన్న ఆర్చర్‌. స్పిన్‌ పిచ్‌లపై బ్యాటింగ్‌ చేయడం అంత తేలిక కాకపోయిన అదేమంత పెద్ద సమస్య కాదన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement