Thursday, April 25, 2024

ఐపీఎల్-14 భారత్‌ లో నిర్వహించే అవకాశమే లేదు: గంగూలీ

కరోనా విజృంభణ కారణంగా అర్ధంతరంగా నిలిచిపోయిన `ఐపీఎల్-14` కొనసాగింపు అంశం గురించి తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. మిగిలిన సీజన్‌ను భారత్‌లో నిర్వహించే అవకాశం లేదని స్పష్టం చేశాడు. ఐపీఎల్-14 మిగతా సీజన్‌ను ఇండియాలో నిర్వహించాలంటే మళ్లీ 14 రోజుల క్వారంటైన్ వంటి నిర్వహణా పరమైన ఇబ్బందులున్నాయి. అందుకే మిగతా సీజన్ భారత్‌లో జరగదు. ఇక, లీగ్‌ను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామో కూడా ఇప్పుడే చెప్పలేం. సరైన సమయం కోసం వేచి చూడాల`ని అన్నాడు. ఇతర దేశాల క్రికెట్ బోర్డులను సంప్రదించాక ఐపీఎల్-14 మిగతా సీజన్ గురించి ఆలోచిస్తామన్నాడు. 

`

Advertisement

తాజా వార్తలు

Advertisement