Wednesday, April 24, 2024

ఇంగ్లాండ్ తో సిరీస్ కు ముందు టీమ్‌ఇండియాకు షాక్‌! ఇషాంత్‌ వేలికి కుట్లు..

టీమిండియా సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ గాయపడ్డాడు. అతడి కుడిచేతి మధ్య, ఉంగరపు వేళ్లకు గాయాలవ్వడంతో కుట్లు వేశారు. ఇంగ్లాండ్‌ టెస్టు సిరీసు లోపు అతడు కోలుకుంటాడని జట్టు వర్గాలు ధీమాగా ఉన్నాయి. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఇషాంత్‌ గాయపడ్డాడు. తన బౌలింగ్‌లోనే ఓ బంతిని ఆపేందుకు అతడు డైవ్‌ చేశాడు. దాంతో చేతివేళ్లకు గాయాలయ్యాయి. తీవ్రంగా రక్తస్రావం కావడంతో వెంటనే అతడిని మైదానం నుంచి తీసుకెళ్లారు. ఈ మ్యాచులో టీమ్‌ఇండియా 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement