Thursday, April 18, 2024

క‌డియం శ్రీహరికి శుభాకాంక్షలు తెలిపిన జెడ్పీ చైర్ పర్సన్ ..

బయ్యారం ప్రభ న్యూస్ : ఎమ్మెల్సీ గా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిని, మహబూబాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కుమారి అంగోత్ బిందు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయ‌న‌కి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనుభవజ్ఞులైన శ్రీహరి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ గా ఏకగ్రీవంగా ఎన్నికయి ప్రమాణ స్వీకారం చేశారు.ఈ నేపథ్యంలో శ్రీహరి ని చైర్ పర్సన్ బిందు కలిసి శుభకాంక్షలు తెలిపారు. శ్రీహరి ఎన్నికవల్ల ఉమ్మడి వరంగల్ జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement