Saturday, April 20, 2024

టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డికి మరో అవకాశం?

టీటీడీ పాలకమండలి గడువు ఈ నెల 21తో ముగుస్తోంది. దీంతో కొత్త పాలకమండలి ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మరోవైపు ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికే మరోసారి ఆవకాశం దక్కనుందని తెలుస్తోంది. మరోవైపు శనివారం నాడు టీటీడీ పాలకమండలి సమావేశం కాబోతోంది. ఎల్లుండి స్వామివారి ఆలయంలో భోగశ్రీనివాసమూర్తికి ఏకాంతంగా సహస్రకలశాభిషేకాన్ని అర్చకులు నిర్వహించనున్నారు. 22వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జేష్ఠాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి. 24వ తేదీన వర్చువల్ ఆర్జిత సేవలను కూడా టీటీడీ రద్దు చేసింది. రేపు జరగనున్న చివరి పాలకమండలి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement