Saturday, April 20, 2024

మర్రిపెడ ఎస్సైపై చర్యలు తీసుకోవాలి: వైఎస్ఆర్‌టీపీ నేత ఇందిరా శోభన్

ట్రెయినీ ఎస్సైపై లైంగిక వేధింపులకు పాల్పడిన మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ ఎస్సై శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నాగర్ కర్నూల్ పార్లమెంటరీ కన్వీనర్ శ్రీమతి ఇందిరా శోభన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నాడు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మహిళా ఆఫీసర్లపై అఘాయిత్యానికి పాల్పడడం దారుణమన్నారు. పోలీసు శాఖలోనే మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో లైంగిక వేధింపులకు పాల్పడిన మర్రిపెడ ఎస్సైను తక్షణమే విధుల నుంచి డిస్మిస్ చేయాలని ఆమె కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement