Saturday, April 20, 2024

రత్నప్రభను గెలిపిస్తే కేంద్రమంత్రి చేస్తారా?

తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా వైసీపీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం నాడు రేణిగుంట నుంచి శ్రీకాళహస్తి వరకు వైసీపీ నేతలు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. వెంకన్న పాదాల సాక్షిగా బీజేపీ ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చిందని.. ఇప్పుడు పచ్చి మోసం చేసిన ఆ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలని ఆయన నిలదీశారు. ఒకవేళ ప్రజలు బీజేపీ అభ్యర్థి రత్నప్రభను గెలిపిస్తే కేంద్రమంత్రిని చేసే స్థాయి సోము వీర్రాజుకు ఉందా? అని ప్రశ్నించారు.

అటు టీడీపీ గెలిస్తే పెట్రోల్‌ ధరలు తగ్గిస్తామనడం లోకేష్ అజ్ఞానానికి నిదర్శనమని భూమన కరుణాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు బాబు, లోకేష్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదని దుయ్యబట్టారు. ఓటమి భయంతో ఎన్నికలు నిలిపివేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని భూమన నిప్పులు చెరిగారు. ఈ ర్యాలీలో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ అభ్యర్థి గురుమూర్తి పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement