Thursday, March 28, 2024

రాచరిక పాలనను అంతం చేయాలి: పాదయాత్రలో వైఎస్ షర్మిల

రాష్ట్రంలో కొనసాగుతున్న రాచరిక పాలనను అంతం చేయాలని వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. మంగళవారం ప్రజాప్రస్థానం మహా పాదయాత్ర 33వ రోజు కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని మూటకొండూరు మండల కేంద్రానికి చేరుకున్న సంధర్బంగా మాట్లాడారు. అందరిని ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకు సాగగా గ్రామ గ్రామన ప్రజలు ఘన స్వాగతం పలికారు.  మంగళవారం సంధర్బంగా నిరుద్యోగవారంలో మూటకొండూరు గ్రామంలో నిరుద్యోగ నిరాహార దీక్ష లో పాల్గొన్నారు. ముందుగా వైఎస్సార్ విగ్రహానికి  పూలమాల వేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement