Friday, March 29, 2024

వైఎస్సార్ పాలన దక్షితకు నిదర్శనం: వైఎస్ షర్మిల

వైయస్ఆర్ పథకాలు నేటికీ సజీవంగా ఉన్నాయంటే అది ఆయన పాలన దక్షతకు నిదర్శనమని వైఎస్సార్టిపి అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. శుక్రవారం ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా మోత్కూరు మండలం పాటిమట్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ పథకాలు ఏ కుటుంబానికి కూడా సరిగ్గా అందలేదని, రైతుబంధు పథకంలో మోసాన్ని ప్రజలు గమనించాలన్నారు. ఎకరాకు రూ.5 వేలు ఇచ్చి, రూ.25 వేల విలువైన పథకాలు బంద్ చేశాడని, నాడు వైయస్ఆర్ సబ్సిడీపై విత్తనాలు, ఎరువుల అందించి, పంట నష్టపోతే పరిహారం ఇన్ పుట్ సబ్సిడీ, యంత్ర లక్ష్మి పథకాల ద్వారా ఆదుకున్నారని చెప్పారు. కేసీఆర్ మోసం చేయని వర్గం లేదని, దళితులకు మూడెకరాలు, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు, మైనార్టీల‌కు 12శాతం రిజ‌ర్వేష‌న్లు ఇలా అన్ని ర‌కాల హామీలు ఇచ్చి మోసం చేసాడన్నారు. కేసీఆర్ దుర్మార్గ పాలన సాగిస్తున్నా ప్రతిపక్షాలు ఏనాడు ప్రశ్నించలేదని, అందుకే వైయస్సార్ తెలంగాణ పార్టీ పుట్టిందన్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ తరఫున తుంగతుర్తి నియోజకవర్గ అభ్యర్థిగా మీ ఆత్మీయుడు ఏపూరి సోమన్నను ప్రకటించామని, రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా సోమన్నను భారీ మెజారిటీతో గెలిపించాన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement