Friday, March 29, 2024

తెలంగాణ ప్ర‌భుత్వంపై ష‌ర్మిల విమ‌ర్శ‌లు ..

తెలంగాణ ప్ర‌భుత్వంపై వైఎస్ ఆర్ టీపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మండిప‌డ్డారు. రైతుల గుండెలు ఆగిపోతుంటే చోద్యం చూస్తున్నారా అని నిల‌దీశారు. వడ్లను రోడ్ల మీద, కల్లాల్లో పెట్టుకుని ఎప్పుడుకొంటారో తెలియక కుప్పల మీదే రైతుల గుండెలు ఆగిపోతుంటే, యాసంగి వడ్ల మీద రాజకీయాలు చేస్తున్నారు. మీ డ్రామాలకు ఇప్పటికే 10 మంది రైతుల గుండెలు ఆగిపోయాయి. ఇవాళ మరో ఇద్దరు..ఇంకెంత మంది రైతులు చస్తే మీ కండ్లు చల్లబడుతాయి కేసీఆర్ గారు అని వైఎస్ ష‌ర్మిల ప్ర‌శ్నించారు. ఇంకెంత మందిని బలితీసుకొంటారు.. రైతులను కోటీశ్వర్లను చేశాం, కార్లల్లో తిరుగుతున్నారు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. ఒక్కసారి ఫామ్ హౌస్ మత్తు నుంచి బయటికి వస్తే తెలుస్తుంది.. రైతులు కోటీశ్వరులు కావడం కాదు మీరు ఉరి కొయ్యకు ఉరి వేస్తున్నారని. మీరు పంట కొనక కాటికి పంపుతున్నార‌ని దుయ్య‌బట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement