Saturday, April 20, 2024

మానుకోటపై మీ ప్రేమ అమోఘం.. మ‌రికొన్ని ప‌నులు ఇవ్వాల‌ని రామ‌న్న‌కు విన‌తి

‘‘మహబూబాబాద్ జిల్లా ఏర్పాటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసాదించిన వరం. మానుకోట అభివృద్ధి చెందుతుందంటే అది మంత్రి రామన్న ఆశీర్వాద బలం.. మీ చల్లని చూపు మా ప్రాంతంపైన ఇలాగే కొనసాగాలన్నా. ప్రజల అవసరాలను గుర్తించి మరికొన్ని మంజూరీలు ఇవ్వాలన్నా’’ అని కోరుతూ మహబూబాబాద్ ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ కు వినతిపత్రం అందజేశారు.

మహబూబాబాద్ కు ఇండోర్ స్టేడియం మంజూరు చేయాలని కవిత కోరారు. అదేవిధంగా రెండుకోట్ల రూపాయలతో షాదీఖానా, ఆర్ఓబి, ఆర్ యుబి విద్యుద్దీకరణ, మహబూబాబాద్ నుండి ఈదులపూసపల్లి వరకు రూ.6కోట్లతో రోడ్డు మంజూరు చేయాలని వినతిపత్రంలో కోరారు. అంతేకాకుండా డబుల్ బెడ్ రూం ఇండ్లలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని మంత్రి కేటీఆర్​ను కవిత కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement