Thursday, April 18, 2024

సోషల్‌ మీడియాలో యువకులకు గాలం.. లక్షల్లో నగదు కాజేసిన యువతి అరెస్ట్‌..

సోషల్‌ మీడియాలో యువకులను ట్రాప్‌ చేస్తున్న యువతిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి… ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో ఫొటోలు పోస్ట్‌ చేసి యువకులను ట్రాప్‌ చేస్తున్న కృష్ణాజిల్లాకు చెందిన పరసా తనుశ్రీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అందంగా ముస్తాబై వీడియోలు అప్‌లోడ్‌ చేసి.. లైక్‌లు, కామెంట్స్‌ చేసిన వారిని తనుశ్రీ టార్గెట్‌ చేసుకుంటుంది. వారితో పరిచడం ఏర్పర్చుకుని ప్రేమ, పెళ్లి పేరుతో డబ్బులు వాసూళ్లకు పాల్పడుతుంది. ఈ యువతి వలలో హైదరాబాద్‌కు చెందిన యువకుడు చిక్కగా.. అతడి వద్ద రూ.31 లక్షలను ఆ యువతి కాజేసింది. మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తనుశ్రీతోపాటు ప్రియుడు శ్రీకాంత్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement