Thursday, April 18, 2024

ఎన్టీఆర్ ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ షోపై వీడిన సందిగ్ధత

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండితెర‌పైనే కాదు బుల్లితెర‌పైనా సంచనాలు సృష్టిస్తున్నాడు. ఇప్పటికే బిగ్ బాస్ తొలి సీజ‌న్‌కు హోస్ట్‌గా వ్యవహరించి మంచి మార్కులు కొట్టేసిన అతడు తాజాగా జెమినీ టీవీలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు(EMK)’ అనే రియాలిటీ షోను చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి కొన్ని ప్రోమోలు కూడా విడుద‌ల చేశారు. ఇక షో మ‌రి కొద్ది రోజుల‌లో ప్ర‌సారం కానుంది అనుకునే స‌మ‌యంలో క‌రోనా సెకండ్ వేవ్ మొద‌లైంది. దీంతో షో తాత్కాలిక వాయిదా ప‌డింది. అయితే రానున్న రోజుల‌లో ఎన్టీఆర్ ప‌లు సినిమాల‌తో బిజీగా ఉండ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి డేట్స్ అడ్జెస్ట్ చేయ‌డం క‌ష్టంగా ఉంటుంద‌ని, ఇక ‘ఎవరు మీలో కోటీశ్వరులు’కు ఎన్టీఆర్ గుడ్ బై చెప్పిన‌ట్టే అనేక పుకార్లు వినిపించాయి. ఈ క్ర‌మంలో జెమినీ టీవీ యాజమాన్యం తాజాగా ఓ ప్రోమో వదిలి రూమర్లకు చెక్‌ పెట్టింది. త్వరలోనే ఈ షో ప్రారంభం కానుందని ప్రోమో ద్వారా తెలిపింది. ఈ షో ఆడుతున్న వారి క‌ల‌ల‌ను నెర‌వేరుస్తుంది. చూస్తున్న వారికి వందశాతం వినోదం అందిస్తుందని కూడా పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement