Friday, April 19, 2024

యువకుని గొంతు కోసి దారుణ హత్య..

నిర్మల్ టౌన్ మే 12 ప్రభా న్యూస్ ( యువకుని గొంతు కోసి దారుణంగా హత్య కేంద్రంలోని బెయిల్ బజార్ వద్ద భారత్ పెట్రోల్ పంపు ఎదురుగా గురువారం సాయంత్రం గాజులపేటకు చెందిన జుబేర్ అనే యువకుడిని దారుణంగా గొంతుకోసి హత్యచేశారు .
నిర్మల్ పట్టణంలోని బెయిల్ బజార్ వద్ద భరత్ పెట్రోల్ పంప్ ఎదురుగా గాజుల‌పేట‌ వీధికి చెందిన జుబేర్ ఖాన్ 20 సం. అదే కాలనీలో అద్దెకుండే ఫయాజ్ అనే 40 సం. వ్య‌క్తి బట్టలు కత్తిరించే కత్తెరతో గొంతుకోసి అందరూ చూస్తుండగానే దారుణంగా హత్య చేసి పరారయ్యాడు, స్థానికులు హుటాహుటిన యువకుడిని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

డీఎస్పీ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ఫయాజ్ అనే వ్యక్తి గాజులపేటకు చెందిన జుబేర్ అనే యువకుడిని బట్టలు కత్తిరించే కత్తెరతో గొంతుకోసి హతమార్చాడని వారిద్దరి మధ్య తగాదాలున్నాయని అక్రమ సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగిందని నిందితుడు ఆయుధంతో సహా వచ్చి పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడని ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement