Friday, March 29, 2024

త‌ల్లీ, కూతుళ్ల‌పై యువ‌కుడి దాడి

గుంటూరు జిల్లా కృష్ణాన‌గ‌ర్ లో ప్రేమ వ్య‌వ‌హారంలో ఓ యువ‌కుడు త‌ల్లీ, కూతుళ్ల‌పై దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న గురువారం చోటుచేసుకుంది. ప్రేమిస్తున్నాన‌ని యువ‌తిని వేధిస్తుండ‌డంతోనే త‌ల్లి మంద‌లించి ఉంటుంద‌ని, అందుచేత‌నే త‌ల్లి, కూతుళ్ల‌పై ఆ యువ‌కుడు దాడి చేసిన‌ట్లు స్థానికులు తెలిపారు. కృష్ణానగర్ పీఎఫ్‌ కార్యాలయం వద్దనున్న అపార్టుమెంట్‌లో ఈ ఘటన జరిగింది. యువ‌కుడి దాడిలో త‌ల్లి, కూతుళ్ల గొంతుపై తీవ్రంగా గాయాల‌య్యాయి. దీంతో స్థానికులు వెంట‌నే వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఘ‌ట‌న అనంత‌రం యువ‌కుడు బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు య‌త్నించ‌గా స్థానికులు ప‌ట్టుకుని పోలీసులు అప్ప‌గించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement