Wednesday, April 24, 2024

గుండెపోటుతో యువ క్రికెటర్ మృతి

పండుగ పూట క్రికెట్‌లో తీవ్ర విషాదం నెలకొంది. సౌరాష్ట్ర యువ బ్యాటర్ అవి బరోట్ హఠాత్తుగా మరణించాడు. 29 సంవత్సరాల వయసులో గుండెపోటుతో శుక్రవారం మృతి చెందాడు. ఈ విషయాన్ని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటన చేసింది.

‘ఈ వార్త విని ప్రతి ఒక్కరం దిగ్భ్రాంతికి గురయ్యాం. అవి బరోట్ అక్టోబర్ 15 సాయంత్రం గుండెపోటుతో మృతి చెందాడు. సౌరాష్ట్ర క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం ఉంది. అతడు లేని లోటు ఎవరూ తీర్చలేనిది’ అంటూ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా కుడి చేతి వాటం గల అవి బరోట్ 2011లో అండర్ 19 క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2019 – 2020 సీజన్‌లో రంజీ ట్రోఫీ గెలిచిన జట్టులో బరోట్ ఒకడు. అతడు మొత్తం 38 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడగా… 38 లిస్ట్, 20 దేశవాళీ ట్వంటీ-20 మ్యాచ్‌లలో తన సత్తా చాటాడు. కాగా అవి బరోట్ మృతి పట్ల పలువురు క్రీడాకారులు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement