Thursday, April 25, 2024

ఎన్నిక‌ల వేళ య‌డ్యూర‌ప్ప రాజ‌కీయ స‌న్యాసం…

బెంగుళూరు – త్వ‌ర‌లో కర్నాట‌క శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో బిజెపి సీనియ‌ర్ నేత‌, మాజీ ముఖ్య‌మంత్రి బీఎస్ యడ్యూరప్ప ఆ పార్టీకి షాక్ ఇచ్చారు.. తాను రాజ‌కీయాల నుంచి తప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు.. త‌న వ‌య‌సు 80 దాట‌డంతో ఇక పై ఎన్నిక‌ల‌లో పోటీ చేయ‌న‌ని చెప్పారు.. అయితే పార్టీలో క్రియాశీలకంగా ఉండి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి నరేంద్ర మోడీని గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డుతానని తెలిపారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న శికారిపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి త‌న కుమారుడు విజయేంద్రను పోటీ చేయిస్తానని ప్రకటించారు. దీనిపై పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందని కూడా చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement