Wednesday, April 24, 2024

గ్రేటర్ విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ విజయం

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లోనూ వైసీపీ హవా కొనసాగింది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటింగ్ నిర్వహించగా, అనంతరం ఓట్ల లెక్కింపు నిర్వహించారు. 10 మంది వైసీపీ కార్పొరేటర్లు ఈ ఎన్నికల్లో విజయం అందుకున్నారు. మొత్తం 67 మంది కార్పొరేటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులో 57 మంది వైసీపీకి చెందిన వారే కావడంతో ఆ పార్టీకి విజయం సులభమైంది.

ఓ నగరపాలక సంస్థకు స్టాండింగ్ కమిటీ ఎంతో కీలకమైంది. దీనికి మేయర్ నాయకత్వం వహిస్తారు. ఇందులో 10 మంది డైరెక్టర్లుగా కొనసాగుతారు. తాజా ఎన్నికల ద్వారా జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అందరూ వైసీపీ కార్పొరేటర్లే గెలిచారు. కాగా ఈ విజయంపై మంత్రి అవంతి శ్రీనివాసరావు, పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హర్షం వెలిబుచ్చారు. పరిషత్ ఎన్నికల్లోనూ వైసీపీదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు.

ఈ వార్త కూడా చదవండి: హుజురాబాద్‌లో ఈటెలకు గెలుపు కష్టమేనా?

Advertisement

తాజా వార్తలు

Advertisement