Friday, March 29, 2024

5 కోట్ల మంది ప్రజల జీవితాలను చంద్రబాబు తాకట్టు పెట్టాడు: విజయసాయిరెడ్డి

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం నేపథ్యంలో మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మరోసారి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు నాడు బాబు పన్నిన ‘ఓటుకు నోటు కుట్ర’ రాష్ట్రాన్ని ఇప్పటికీ పీడిస్తోందని ఆరోపించారు. తట్టాబుట్టా సర్దుకుని పారిపోయి రావడమే కాక, అక్రమ సాగునీటి ప్రాజెక్టులను చంద్రబాబు ప్రశ్నించలేకపోయాడని ఎద్దేవా చేశారు.

ఓటుకు నోటు కేసులో అరెస్టు తప్పించుకునేందుకు ఐదు కోట్ల మంది జీవితాలను చంద్రబాబు తాకట్టు పెట్టాడని విజయసాయిరెడ్డి విమర్శించారు. తెలంగాణలో టీడీపీ ఉంటుంది.. కాంగ్రెస్ ఉంటుంది.. కేంద్రంలో బీజేపీ ఉంటుందని.. అందులోకి పంపించిన ఎంపీలు పొత్తుల కోసం లాబీయింగ్ చేస్తుంటారని చురకలు అంటించారు. తమరు చకోర పక్షిలా ఎదురు చూస్తుంటారని, ఏ ఎన్నికలొచ్చినా వామపక్షాల కాళ్లూ పట్టుకుంటారని, ఇదే కదా బాబూ మీ పొలిటికల్ ఫిలాసఫీ అంటూ విజ‌యసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

ఈ వార్త కూడా చదవండి: కృష్ణా జలాల అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కారు

Advertisement

తాజా వార్తలు

Advertisement