Thursday, April 25, 2024

టీడీపీ మాక్ అసెంబ్లీపై విజయసాయిరెడ్డి ఎద్దేవా

అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించిన టీడీపీ నేత‌లు మాక్ అసెంబ్లీ నిర్వ‌హించుకుంటున్నారు. అయితే టీడీపీ మాక్ అసెంబ్లీపై వైసీపీ ఎంపీ విజ‌యసాయిరెడ్డి చుర‌క‌లంటించారు. ఈ మాక్ అసెంబ్లీలో లోకేష్‌కు చంద్రబాబె ఏ మంత్రి ప‌ద‌వి ఇచ్చాడో అంటూ ఎద్దేవా చేశారు.

‘ఏం నాటకాలయ్యా చంద్రం? అందుకే మీది తెలుగు డ్రామా పార్టీ అన్నది. అసెంబ్లీకి డుమ్మాకొట్టి తెలంగాణ నుంచి జూమ్ లో అసెంబ్లీ పెట్టేశాడు. పచ్చ నేతలే స్పీకర్ – మంత్రులట! ఇంకా ఢిల్లీలో చక్రం తిప్పేస్తున్నానన్న భ్రమల్లోనే ఉన్నాడు. ఇంతకీ పుత్రరత్నం లోకేశంకి ఏం మంత్రి పదవిచ్చాడో బాబు?’ అని విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. తెలుగు డ్రామా పార్టీ జ‌బ‌ర్ద‌స్త్ షో అంటూ ఓ ఫొటోను ఆయ‌న పోస్ట్ చేశారు. కాగా అసెంబ్లీలో ప్ర‌భుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి మాట నిల‌బెట్టుకుంద‌ని విజ‌యసాయిరెడ్డి అన్నారు. ‘హామీ ఇస్తే నిలబెట్టుకోవడం జగన్ గారి సహజ గుణం – సహజ శైలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని ఫిబ్రవరిలోనే మాటిచ్చారు…అసెంబ్లీలో తీర్మానం చేసి మాట నిలబెట్టుకున్నారు. ఏపీ గుండె చప్పుడును ఢిల్లీలో వినిపించడానికి ఏమాత్రం వెనుకాడని ప్రభుత్వమిది’ అని విజ‌యసాయిరెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement