Friday, March 29, 2024

చంద్రబాబు రెచ్చగొట్టారు… రఘురామ బట్టలు చించుకున్నారు: విజయసాయిరెడ్డి

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్టు చేసిన నేప‌థ్యంలో టీడీపీ నేత‌ల‌పై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘జగన్ గారిని అప్రతిష్ఠ‌ పాలు చేయడానికి ఎల్లోమీడియా, చంద్రబాబు మనుషులు తాము ఏడవాలనుకున్నవన్నీ రఘురామ, ఆయన కుటుంబ సభ్యులతో చెప్పిస్తున్నారు. వాడుకోవడం, వెన్నుపోటు పొడవడం ఈ గ్యాంగుకు బాగా తెలిసిన విద్య. కడప పేరు చెప్పించి అక్కడి ప్రజలను అవమానించాలని కుట్రలు పన్నుతున్నారు’ అని విజ‌యసాయిరెడ్డి ఆరోప‌ణ‌లు గుప్పించారు.

‘దిగజారుడు అనేది జారుడు బండ లాంటిది. పతనం వైపు, వెనక్కి రాలేనంతగా నెడుతూనే ఉంటుంది. ఎందుకిలా జరిగింది అని ఆలోచించుకునేటప్పటికి టైం మించి పోతుంది.. ఎవరో రెచ్చగొడితే, ఈల వేస్తే, అన్నీ వదిలేసి బట్టలు చించుకుంటే ఇలాగే అవుతుంది. స్వయంకృతానికి బాధ్యులుండరు’ అని విజ‌యసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement