Tuesday, March 19, 2024

వ‌కీల్ సాబ్ సినిమాకు స్పందన లేదు!

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు, పార్టీ నేత నారా లోకేష్ ల పై వైసీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. తిరుపతి లోక్ సభ వైసీపీ అభ్యర్థి గురుమూర్తిని కించపరుస్తూ టీడీపీ సోషల్ మీడియా పోస్టింగ్ లు చేస్తుందని ఫిర్యాదు చేశారు. దళితులను అవమానించినందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, సైబర్ చట్టాల కింద చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు కైలే అనిల్, మేరుగ నాగార్జునలు ఫిర్యాదు చేశారు.

టిడిపి అభ్య‌ర్థిని గెలిపించాల‌ని సోష‌ల్ మీడియా ద్వారా త‌మ అభ్య‌ర్థిపై చంద్రబాబు బుర‌ద జ‌ల్లుతున్నారు ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాల‌ని డిజిపిని కోరినట్లు తెలిపారు. దళితుడైన తమ అభ్యర్థిని కించపరుస్తూ టీడీపీ అధికారిక ఖాతా నుంచి పోస్టింగ్ లు పెడుతున్నారని తెలిపారు.  ఈ పోస్టింగులు కచ్చితంగా ఎట్రాసిటీ కిందకి వస్తాయని, వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశామన్నారు.

చంద్రబాబుకి మొదటి నుంచీ దళితులంటే చిన్న చూపేనని, దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న వ్యక్తి ఆయన అని విమర్శించారు. తిరుప‌తిలో వైసీపీ గెలుస్తుంద‌నే భ‌యం చంద్ర‌బాబుకు ప‌ట్టుకుందన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా, ఎంత అవమానించినా తమ అభ్యర్థి గురుమూర్తి భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్ లపై వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని వారు కోరారు.

ఇక పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ‌కీల్ సాబ్ సినిమా టికెట్లు కొనేవాళ్లే రాష్ట్రంలో క‌రువైయ్యారని వ్యాఖ్యానించారు. జ‌న‌సేన అస‌త్య ప్ర‌చారం చేస్తోందని మండిపడ్డారు. ఇత‌ర రాష్ట్రాల్లోనే వ‌కీల్ సాబ్ కు స్పంద‌న లేదన్నారు. సినిమాను కూడా రాజ‌కీయంగా వాడుకోవాల‌ని చూస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement