Saturday, April 20, 2024

గ్లాసు గుర్తు.. బీజేపీనే అడగండి: వైసీపీ

జనసేన గాజు గ్లాసు గుర్తును వేరే పార్టీకి కేటాయించటంపై పవన్ పార్టీ.. బీజేపీనే నిలదీయాలన్నారు వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య.  కొవిడ్ సమయంలో అంబానీలు, అదానీల వ్యాపారం కోసం ఆలోచించిన పార్టీతో.. పవన్ పార్టీ పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ అత్యధిక మెజారీటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కాగా, తిరుపతి ఉపఎన్నికలో నవతరం పార్టీకి గాజు గుర్తు  కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీకి గ్లాస్‌ టెన్షన్‌ పట్టుకుంది. మిత్రపక్షమైన జనసేన గుర్తు… మరో పార్టీకి రావడంతో ఓట్లు చీలతాయన్న గుబులు ఆపార్టీలో వ్యక్తమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement