Saturday, April 20, 2024

చంద్ర‌బాబు..లోకేష్ త‌ట్టాబుట్టా స‌ర్దుకోవాల్సిందే..రోజా..

టిడిపి అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్ పై సెటైర్స్ వేశారు వైసీపీ ఎమ్మెల్యే రోజా..తండ్రి..కొడుకులిద్ద‌రూ త‌ట్టా,బుట్టా స‌ర్దుకుని హైద‌రాబాద్ కి వెళ్ళిపోవాల‌ని ఎద్దేవా చేశారు. కుప్పం మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఓట‌మితో ఇప్ప‌టికైనా బుద్ది వ‌చ్చి ఉంటుంద‌ని మండిప‌డ్డారు. ప్ర‌జ‌లంతా సీఎం జ‌గ‌న్ వైపే ఉన్నార‌నే విష‌యం మ‌రోసారి రుజువైంద‌న్నారు.
నలబై ఏళ్ళు ఇండ్రస్టీ అయినా చంద్రబాబును కుప్పం ప్రజలు తరిమి కొట్టారని చురకలు అంటించారు రోజా. కుప్పంలోనే ఇల్లు లేని చంద్రబాబును…హైదరాబాద్ ఇంటికి పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్ ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని.. కుప్పం ప్రజలు జగన్ వెంటనే ఉన్నారని తెలిపారు. డిల్లీ చక్రం తిప్పుతాననే చంద్రబాబు…. కుప్పం మున్సిపాలిటీలు బోక్క బోర్ల పడ్డారని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement