Thursday, April 18, 2024

అనారోగ్యంతో ఎమ్మెల్యే రోజా ఇలా మారిపోయారేంటి?

అటు రాజకీయాలను.. ఇటు బుల్లితెరను సమన్వయం చేసుకుంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రజలకు అందుబాటులో ఉంటారు. అయితే.. కొంత కాలంగా ఆమెను అనారోగ్యం వేధిస్తున్నట్టు సమాచారం. ఆ పరిస్థితి మరింత ఇబ్బంకరంగా తయారవడంతో ఆమె చికిత్స తీసుకోవడం అనివార్యమైంది. ఈ క్రమంలోనే రోజా ఆసుపత్రిలో చేరారు. మార్చి 24న ఆమెకు రెండు శస్త్రచికిత్సలు నిర్వహించినట్టు తెలిసింది. ఆపరేషన్లు విజయవంతంగా పూర్తవడంతో.. ఆ ఇబ్బందుల నుంచి పూర్తిస్థాయిలో బయటపడ్డారు.

అయితే.. చికిత్స తర్వాత చాలా కాలం ఇంట్లో విశ్రాంతి తీసుకున్నారు. అందువల్లే జబర్దస్త్ కార్యక్రమంలో రోజా బదులుగా సీనియర్ నటి ఇంద్రజ జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఇన్నాళ్లూ రెస్ట్ తీసుకున్న రోజా.. ఇటీవల తన కుటుంబంతో కలిసి ఫొటోలు దిగారు. ఆమె అనారోగ్యం నుంచి ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదనే విషయాన్ని ఆ ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. మరికొంత కాలం విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఆమె మునుపుటి రూపును సంతరించుకునే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement