Monday, April 15, 2024

వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సర్పంచ్‌లకు ఎలాంటి పనులు చేయడానికి వీల్లేదని ఆదేశించారు. ‘స్థానిక వైసీపీ నాయకుడు కుమార్ రెడ్డి చెప్పిందే చేయాలి. మండలంలోని ఇతర వైసీపీ నాయకులు చెప్పినా చేయొద్దు’ అని ఎమ్మెల్యే హుకుం జారీ చేశారు.

ఇనుగూరుపేట మండలంలో కొత్తూరు, పున్నూరు, పల్లెపాడు, దేవిస్‌పేటలో టీడీపీ సర్పంచ్‌లను గెలిపించడంపై ఎమ్మెల్యే నల్లపురెడ్డి అసహనం వ్యక్తంచేశారు. పెద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన వైసీపీ అభ్యర్థిని ఓడించి టీడీపీ సర్పంచ్ అభ్యర్థిని గెలిపిస్తారా అంటూ ప్రజలను ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రశ్నించారు. కాగా ఇటీవల జగనన్న ఇళ్లలోని బెడ్‌రూంలలో పెళ్లయిన కొత్త జంటలకు శోభనానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని ఎమ్మెల్యే నల్లపురెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో ట్రోల్ అయిన సంగతి తెలిసిందే.

ఈ వార్త కూడా చదవండి: ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి గోల్డ్ మెడల్

Advertisement

తాజా వార్తలు

Advertisement