Saturday, April 20, 2024

వైరల్ వీడియో: జగన్ ప్రభుత్వంపై వైసీపీ నేతల అసంతృప్తి

కరోనా వైరస్ నియంత్రణ విషయంలో సీఎం జగన్ చేతులెత్తేశారని వైసీపీ ముఖ్య నేతలు మాట్లాడుకునే వీడియో ఒకటి సంచలనంగా మారింది. రాజమండ్రిలో ఆకుల సత్యనారాయణ ఇంట్లో ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్గాని భరత్ సమావేశమయ్యారు. కరోనాతో చనిపోయిన వారిని తీసుకెళ్లాలంటే రూ.30 వేల నుంచి 50 వేలు, దహన సంస్కారాలకు రూ.15 వేలు తీసుకుంటున్నారని ఆకుల సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. సీఎం జగన్ ‘ఇప్పుడేం చేశారు బొక్క’ అని పిల్లి సుభాష్ చంద్రబోస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement