Friday, April 26, 2024

సొంతవారిని ప్రధాన పదవుల్లో పెట్టుకున్నారు: య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు..

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత టీడీపీ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు మండిప‌డ్డారు. సంక్షేమ ప‌థ‌కాల‌ను కొన‌సాగించ‌డానికి, ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌డానికి కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం అప్పులపైనే ఆధార‌ప‌డుతోంద‌ని విమ‌ర్శించారు. నిధులు లేని, అప్ర‌ధాన ప‌దవులు బ‌డుగు వ‌ర్గాలకు కేటాయించారని ఆయ‌న మండిప‌డ్డారు. ఏపీ స‌ర్కారు స‌ల‌హాదారుల పేరుతో వంద‌ల కోట్ల రూపాయ‌లు దుబారా చేస్తోంద‌ని ఆయ‌న మ‌ర్శించారు. ఇప్పుడు నామినేటెడ్ ప‌ద‌వుల పేరుతో దోపిడీకి సిద్ధ‌మ‌య్యారని ఆయ‌న చెప్పారు. వైసీపీ ద‌ళిత వ్య‌తిరేక ప్ర‌భుత్వమ‌ని ఆయ‌న ఆరోపించారు. రాష్ట్రంలో ప‌రిపాలించే ప్ర‌ధాన ప‌ద‌వుల్లో సీఎం జ‌గ‌న్ సొంతవారిని పెట్టుకున్నారని ఆయ‌న అన్నారు.

ఇది కూడా చదవండి: వ్యాక్సిన్ వేసుకోకపోవడమే అతిపెద్ద వ్యాధి: జో బైడెన్..

Advertisement

తాజా వార్తలు

Advertisement