Friday, April 19, 2024

యాదాద్రిని అద్భుతంగా నిర్మించారు- ద‌ర్శకుడు రాఘ‌వేంద్ర‌రావు

సీఎం కేసీఆర్ కి అన్ని శుభాలే జ‌ర‌గాల‌ని ఆకాంక్షించారు ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు.. యాదాద్రి శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామివారిని ద‌ర్శించుకున్నారు ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆలయ పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ..తాను కొత్తగా సినిమా రూపొందించే ముందు, అదేవింధంగా సినిమా విడుదల సమయంలో స్వామివారిని దర్శించుకుంటాన‌న్నారు. పూర్తి వినోదభరితమైన ‘వాంటెడ్ పండుగాడు’ అనే సినిమా నేడు విడుదలయిందని తెలిపారు. యాదాద్రి దేవస్థానాన్ని ముఖ్యమంత్రి మహాద్భుతంగా పునర్నిర్మించారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement