Tuesday, April 23, 2024

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామికి ల‌క్ష పుష్పార్చ‌న‌..

ఈ నెల కార్తీక‌మాసం కావ‌డంతో నిత్యం ప్ర‌త్యేక పూజ‌లు జ‌రుగుతూనే ఉంటాయి. ఈ నెల అంతా పుణ్య‌కాలం కావ‌డంతో నిత్య దీపారాధ‌న జ‌రుగుతూఉంటుంది. కాగా యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో స్వామి అమ్మవార్లకు లక్ష పుష్పార్చన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బాలాలయంలో ఉదయం సుప్రభాత సేవతో మొదలైన పర్వాలు, కవచ మూర్తులను ప్రత్యేక హారతులతో కొలిచారు. మండపంలో సుదర్శననారసింహ హోమం, నిత్య కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. సోమవారం ఏకాదశిని పురస్కరించుకొని బాలాలయ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ సుమారు గంటపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement