Friday, March 29, 2024

వరల్డ్‌ టేబుల్‌ టెన్నీస్‌ టోర్నీ.. సాథియన్‌ పరాజయం

వరల్డ్‌ టేబుల్‌ టెన్నీస్‌ టోర్నమెంట్‌లో భాగంగా శనివారంనాడు క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత క్రీడాకారుడు జి.సాథియన్‌ పరాజయం పాలయ్యాడు. జగ్రెబ్‌లో జరుగుతున్న టోర్నీలో వరల్డ్‌ నం.18 చిహ్‌-యువాన్‌ చేతిలో వరల్డ్‌ నం.34 సాథియన్‌ 7-11, 9-11, 5-11 తేడాతో ఓడిపోయాడు. అంతకుముందు టోర్నీ ఆరంభంలో యూరోపియన్‌ చాంపియన్‌, స్లొవేనియా క్రీడాకారుడు వరల్డ్‌ నం.6 డార్కో జోర్గిజ్‌పై 6-11, 12-10, 11-9, 12-10 తేడాతో విజయం సాధించాడు.

ప్రిక్వార్టర్‌లో 16ఏళ్ల చైనా క్రీడాకారుడు చెన్‌ యువాన్యుపై 11-9, 11-7. 12-10తేడాతో ఓడించి క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే… జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు బర్మింగ్‌హామ్‌లో జరుగనున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో సాథియన్‌ తన సత్తా చాటనున్నాడు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement